నైజీరియా:ఆత్మహుతి దాడులు..31 మంది మృతి

- June 17, 2018 , by Maagulf
నైజీరియా:ఆత్మహుతి దాడులు..31 మంది మృతి

నైజిరియాలో బొకోహరమ్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 31 మంది మృతిచెందారు. శనివారం నైజిరియాలోని డామ్‌బోవ పట్టణంలో ఈద్ ప్రార్థనలు నిర్వహించి తిరిగి వస్తున్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో కంటే తర్వాత జరిగిన రాకెట్ల దాడిలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.తొలుత ఆత్మాహుతి దాడిని నిర్వహించిన ఉగ్రవాదులు తర్వాత అక్కడ చేరిన ప్రజలపై రాకెట్స్‌తో దాడి చేశారు. దీంతో క్షతగాత్రుల సంఖ్య పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com