ఈ నెల 21న 'పేపర్ బోయ్' ఫస్ట్ లుక్
- June 18, 2018
ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్, గౌతం నంద లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సంపత్ నంది తన నిర్మాణంలో సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే ఓ పక్క డైరక్షన్ చేస్తూ నిర్మాతగా గాలిపటం సినిమా తీసిన సంపత్ నంది ఇప్పుడు నూతన దర్శకుడు జయశంకర్ ను పరిచయం చేస్తూ పేపర్ బోయ్ సినిమా చేస్తున్నాడు. ఆయన సొంత నిర్మాణ సంస్థ "సంపత్ నంది టీం వర్క్స్", ప్రచిత్ర క్రియేషన్స్-బి.ఎల్.ఎన్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ "పేపర్ బోయ్ ను నిర్మించనున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఈ నెల 21 వ తేదిన విడుదల చేయనుంది ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కళ: రాజీవ్ నాయర్, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల, నిర్మాతలు: సంపత్ నంది-వెంకట్-నరసింహ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు: సంపత్ నంది, దర్శకత్వం: జయశంకర్!
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







