యు.ఏ.ఈ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
- June 18, 2018యు.ఏ.ఈ:4వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దుబాయ్లో జూన్ 21న జబీల్ పార్క్ ప్రాంతంలో నిర్వహించనున్నారు. ఈ వెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు నౌఫ్ మర్వాయి. సౌదీ అరేబియాకి చెందిన తొలి యోగా గురువు అయినా నౌఫ్ మార్వాని, భారత ప్రభుత్వం ద్వారా పద్మ శ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. యోగా డెమోనిస్ట్రేషన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించనుండగా, పలు స్కూల్స్కి చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఈవెంట్స్, పోటీలు కూడా జరగనున్నాయి. నార్తరన్ ఎమిరేట్స్కి సంబంధించి పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్ అల్ కువైన్లోని అల్ అరాబి స్పోర్ట్స్ క్లబ్లో జూన్ 20న సాయంత్రం 6.30 నిమిషాలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుంది. అజ్మన్లోని ఇండియన్ అసోసియేషన్ ప్రిమైసిస్లో జూన్ 21న సాయంత్రం 7 గంటలకు, షార్జాలోని ఎక్స్పో సెంటర్లో జూన్ 22న సాయంత్రం 4 గంటలకు, ఫుజైరాలో మీడియా పార్క్ కన్వెన్షన్ సెంటర్లో జూన్ 22న 6.30 నిమిషాలకు, రస్ అల్ ఖైమాలో జూన్ 22న అమెరికన్ యూనివర్సిటీలో 7 గంటలకు ఈ ఈవెంట్ జరుగుతుంది. యోగా పట్ల ఆసక్తి వున్నవారంతా దుబాయ్లోని మెయిన్ ప్రోగ్రామ్తోపాటు, ఇతర ఎమిరేట్స్లో నిర్వహించే ఈవెంట్స్లోనూ పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్స్లోకి ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి