గొంతులో ద్రాక్ష ఇరుక్కుని రెండేళ్ళ చిన్నారి మృతి
- June 19, 2018
యు.ఏ.ఈ:రెండేళ్ళ చిన్నారి గొంతులో ప్రమాదవశాత్తూ ద్రాక్షపండు ఇరుక్కుపోవడంతో మృతి చెందిన ఘటన అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈద్ తర్వాత మూడో రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. గొంతులో ద్రాక్షపండు ఇరుక్కుని, శ్వాస ఆడక చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఖోర్ఫక్కాన్ హాస్పిటల్ వైద్యులు ఈ ఘటనపై స్పందిస్తూ, చిన్నారిని తమ ఆసుపత్రికి తీసుకొచ్చారనీ, అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా వుందనీ, ఆ చిన్నారిని బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయనీ, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా వుండాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







