గొంతులో ద్రాక్ష ఇరుక్కుని రెండేళ్ళ చిన్నారి మృతి
- June 19, 2018
యు.ఏ.ఈ:రెండేళ్ళ చిన్నారి గొంతులో ప్రమాదవశాత్తూ ద్రాక్షపండు ఇరుక్కుపోవడంతో మృతి చెందిన ఘటన అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈద్ తర్వాత మూడో రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. గొంతులో ద్రాక్షపండు ఇరుక్కుని, శ్వాస ఆడక చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఖోర్ఫక్కాన్ హాస్పిటల్ వైద్యులు ఈ ఘటనపై స్పందిస్తూ, చిన్నారిని తమ ఆసుపత్రికి తీసుకొచ్చారనీ, అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా వుందనీ, ఆ చిన్నారిని బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయనీ, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా వుండాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!