ప్రముఖ నిర్మాత పాల వ్యాపారం: లీటర్ @ 150
- June 22, 2018
తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న వ్యాపార లక్షణాలు కొనసాగిస్తూ సక్సెస్ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నాడు దగ్గుబాటి సురేష్ బాబు. తాజాగా మరో రంగంలోకి కూడా కాలిడబోతున్నారు. హ్యాపీ ఆవులు పేరుతో స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారు. నగర శివార్లలో తనకున్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను పెంచుతున్నారు. మార్కెట్లో లభించే పాలు, కూరగాయలను వాడడం వలన అనారోగ్యానికి గురయ్యాడట. దాంతో తానే పాల వ్యాపారం, సేంద్రియ ఎరువులతో పండించే కూరగాయల వ్యాపారం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చిందట. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో కాకుండా ప్రజలకు నాణ్యమైన పాలను అందించాలనే సంకల్పంతో పాటు బయట దొరుకుతున్న పాలకు, స్వచ్ఛమైన పాలకు ఉన్న తేడా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే పాల వ్యాపారం మొదలు పెడుతున్నట్లు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ధరను కూడా లీటరు ప్యాకెట్కి రూ.150లకు విక్రయించాలనుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!