హీరో నానితో మరోసారి కీర్తి సురేష్!
- June 23, 2018టాలీవుడ్ లో ఈ మద్య మాలీవుడ్ హీరోయిన్లు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. ఇప్పటికే నయనతార, సమంత టాప్ లీడ్ లో ఉండగా ఈ మద్య సాయి పల్లవి, కీర్తి సురేష్ హీరోయిన్లుగా మంచి ఫామ్ లోకి వచ్చారు. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత నానితో 'నేను లోకల్' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. వెంటనే పవన్ కళ్యాన్ లాంటి టాప్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ ఎక్కడికో వెళ్లింది.ఈ సినిమాలో కీర్తి సరేష్ నటనకు తెలుగు, తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రెటీలు ఫిదా అయ్యారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని హీరోలుగా ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఒక వైపున ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే మరోవైపున దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతున్న విషయం తెలిసిందే..సినిమాకి 'జెర్సీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈ సినిమా కోసం నాని క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.ఇక దర్శక నిర్మాతలు కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించి .. కీర్తి సురేశ్ అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. గతంలో నాని .. కీర్తి సురేశ్ కలిసి నటించిన 'నేను లోకల్' హిట్ కావడం ఒక కారణమైతే, 'మహానటి' హిట్ తో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోవడం మరొక కారణం. తెరపై నాని, కీర్తి జంటకు మంచి మార్కులే పడతాయని ఫిక్స్ అయ్యారు. దర్శక నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలే ఎక్కువనే టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ