రైతుల మధ్య ఘర్షణ.. 86 మంది మృతి
- June 25, 2018
రైతులకు, పశు వ్యాపారులకు మధ్య జరిగిన జాతి ఘర్షణల్లో 86 మంది మృతిచెందారు. సెంట్రల్ నైజీరియాలో ఈ ఘటన జరిగింది. స్థానిక జాతులైన బెరోమ్ రైతులు, ఫౌలానీ పశు వ్యాపారుల మధ్య గురువారం భారీ ఘర్షణ జరిగింది. ఆ రోజు సుమారు అయిదు మంది చనిపోయారు. ఆ తర్వాత మళ్లీ శనివారం హింస చోటుచేసుకుంది. ఇక్కడున్న భూమి కోసం కొన్ని దశాబ్ధాలుగా స్థానిక తెగల మధ్య ఘర్షణలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా గ్రామస్థులు ఘర్షణకు దిగిన ఘటనలో 86 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు కమీషన్ ఉండి అడే తెలిపారు. 50 ఇండ్లు, 15 మోటర్సైకిళ్లు, రెండు వాహనాలను తగలబెట్టారు. హింస తర్వాత అక్కడ కర్ఫ్యూ విధించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్