మరో డబల్ యాక్షన్ తో రానున్న మాస్ మహారాజా
- June 27, 2018
బెంగాల్ టైగర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ ఈ మధ్య సినిమాల స్పీడ్ పెంచాడు. వరుసగా రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని చిత్రం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంతో ఇలియానా టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇస్తుంది. దసరా కానుకగా మూవీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం 'చిత్రాల దర్శకుడు వి . ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు రవితేజ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి డిస్కో రాజా అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, ఇందులో ద్విపాత్రిభినయం పోషించనున్నాడట మాస్ రాజా. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది . రవితేజ గతంలో విక్రమార్కుడు , కిక్ 2 చిత్రాల్లో రెండు పాత్రల్లో నటించారు. మరి డిస్కోరాజా చిత్రంలో డ్యూయల్ పాత్రలో కనిపించి ఎలా అలరిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







