మరో డబల్ యాక్షన్ తో రానున్న మాస్ మహారాజా
- June 27, 2018
బెంగాల్ టైగర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ ఈ మధ్య సినిమాల స్పీడ్ పెంచాడు. వరుసగా రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని చిత్రం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంతో ఇలియానా టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇస్తుంది. దసరా కానుకగా మూవీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం 'చిత్రాల దర్శకుడు వి . ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు రవితేజ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి డిస్కో రాజా అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, ఇందులో ద్విపాత్రిభినయం పోషించనున్నాడట మాస్ రాజా. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది . రవితేజ గతంలో విక్రమార్కుడు , కిక్ 2 చిత్రాల్లో రెండు పాత్రల్లో నటించారు. మరి డిస్కోరాజా చిత్రంలో డ్యూయల్ పాత్రలో కనిపించి ఎలా అలరిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







