మరో డబల్ యాక్షన్ తో రానున్న మాస్ మహారాజా
- June 27, 2018
బెంగాల్ టైగర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ ఈ మధ్య సినిమాల స్పీడ్ పెంచాడు. వరుసగా రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని చిత్రం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంతో ఇలియానా టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇస్తుంది. దసరా కానుకగా మూవీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం 'చిత్రాల దర్శకుడు వి . ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు రవితేజ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి డిస్కో రాజా అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, ఇందులో ద్విపాత్రిభినయం పోషించనున్నాడట మాస్ రాజా. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది . రవితేజ గతంలో విక్రమార్కుడు , కిక్ 2 చిత్రాల్లో రెండు పాత్రల్లో నటించారు. మరి డిస్కోరాజా చిత్రంలో డ్యూయల్ పాత్రలో కనిపించి ఎలా అలరిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







