భారీ బడ్జెట్ దిశగా సైరా
- June 27, 2018
ఓ పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా రాణిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఈయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా మూవీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇందులో కీలకమైన యుద్ధ సన్నివేశాలను, అది కూడా నైట్ ఎఫెక్ట్స్ లో రూపొందిస్తున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్స్, ఫైటర్స్ ఈ షెడ్యూల్ కోసం పనిచేస్తున్నారు. సినిమాలోనే అత్యంత ఖరీదైన ఈ షెడ్యూల్ కోసం చరణ్ రూ.40 కోట్లను ఖర్చు చేస్తున్నారు. కాగా సినిమా మొత్తం బడ్జెట్ రూ.200 కోట్ల వరకు ఉండనుందని అంటున్నారు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతారలు, జగపతి బాబు , తమన్నా మొదలగు నటి నటులు నటిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







