భారీ బడ్జెట్ దిశగా సైరా
- June 27, 2018
ఓ పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా రాణిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఈయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా మూవీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇందులో కీలకమైన యుద్ధ సన్నివేశాలను, అది కూడా నైట్ ఎఫెక్ట్స్ లో రూపొందిస్తున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్స్, ఫైటర్స్ ఈ షెడ్యూల్ కోసం పనిచేస్తున్నారు. సినిమాలోనే అత్యంత ఖరీదైన ఈ షెడ్యూల్ కోసం చరణ్ రూ.40 కోట్లను ఖర్చు చేస్తున్నారు. కాగా సినిమా మొత్తం బడ్జెట్ రూ.200 కోట్ల వరకు ఉండనుందని అంటున్నారు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతారలు, జగపతి బాబు , తమన్నా మొదలగు నటి నటులు నటిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







