రైతుల కష్టాల ఫై మహేష్ సినిమా.!
- June 27, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే నాల్గు పాటలు , లవ్ , యాక్షన్ మాత్రమే కాదు సామజిక అంశాలు ఉండేలా చూసుకుంటాడు. ఇటీవల వచ్చిన శ్రీమంతుడు ,స్పైడర్ , భరత్ అనే నేను చిత్రాల్లో ప్రజల కష్టాలను గురించి తెలియసాడు. తాజాగా ఇప్పుడు చేస్తున్న తన 25 వ చిత్రం లోను సామాజిక సమస్యల్ని ప్రస్తావిస్తునట్లు ఫిలిం నగర్ లో ప్రచారం అవుతుంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం లో చేస్తున్న ఈ మూవీ లో తెలుగు రాష్ట్రాల్లోని రైతుల సమస్యలను, కష్టాలను గురించి చూపించబోతున్నారట. ముఖ్యంగా రైతుల రుణాలు, వాళ్ళ బీద పరిస్థితులను ప్రదానం చేసుకొని డైరెక్టర్ కథ రాసినట్లు, అలాగే సినిమా రైతుల్లో కొత్త ఉత్తేజం నింపే తరహాలో ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. హీరోయిన్ పూజా హగ్దే , మహేష్ బాబు లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
ఈ షెడ్యూల్ పూర్తి కాగానే అమెరికా లో మరో షెడ్యూల్ జరపనున్నారు. దాని తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ తో సినిమా పూర్తి అవుతుందని తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. దిల్ రాజు , అశ్విని దత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా , దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







