రైతుల కష్టాల ఫై మహేష్ సినిమా.!
- June 27, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే నాల్గు పాటలు , లవ్ , యాక్షన్ మాత్రమే కాదు సామజిక అంశాలు ఉండేలా చూసుకుంటాడు. ఇటీవల వచ్చిన శ్రీమంతుడు ,స్పైడర్ , భరత్ అనే నేను చిత్రాల్లో ప్రజల కష్టాలను గురించి తెలియసాడు. తాజాగా ఇప్పుడు చేస్తున్న తన 25 వ చిత్రం లోను సామాజిక సమస్యల్ని ప్రస్తావిస్తునట్లు ఫిలిం నగర్ లో ప్రచారం అవుతుంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం లో చేస్తున్న ఈ మూవీ లో తెలుగు రాష్ట్రాల్లోని రైతుల సమస్యలను, కష్టాలను గురించి చూపించబోతున్నారట. ముఖ్యంగా రైతుల రుణాలు, వాళ్ళ బీద పరిస్థితులను ప్రదానం చేసుకొని డైరెక్టర్ కథ రాసినట్లు, అలాగే సినిమా రైతుల్లో కొత్త ఉత్తేజం నింపే తరహాలో ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. హీరోయిన్ పూజా హగ్దే , మహేష్ బాబు లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
ఈ షెడ్యూల్ పూర్తి కాగానే అమెరికా లో మరో షెడ్యూల్ జరపనున్నారు. దాని తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ తో సినిమా పూర్తి అవుతుందని తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. దిల్ రాజు , అశ్విని దత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా , దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







