ఇరాక్ ప్రధాని ఆదేశం.. 12 మంది ఉగ్ర ఖైదీల కాల్చివేత

- June 29, 2018 , by Maagulf
ఇరాక్ ప్రధాని ఆదేశం.. 12 మంది ఉగ్ర ఖైదీల కాల్చివేత

ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాది ఆదేశాల మేరకు 12 మందిని కాల్చి చంపారు. ఉగ్రవాదం ఆరోపణలపై మరణశిక్షను ఎదుర్కొంటున్న ఆ 12 మందికి అత్యవసరంగా శిక్షను విధించారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇటీవల 8 మంది భద్రతా దళాలను హతమార్చారు. దీంతో ఆగ్రహించిన ప్రధాని ఉగ్రవాదం కేసుల్లో శిక్షను ఎదుర్కొంటున్న వారిని అంతం చేయాలంటూ గురువారం ప్రధాని అబాది తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉగ్రవాద కేసుల్లో ఇక ఎటువంటి అభ్యర్థనలు చేయలేనివారు, కేసుకు సంబంధించి తుది తీర్పు వెలుబడిన వారిని మాత్రమే తుదముట్టించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com