టీనేజ్ డ్రగ్ స్మగ్లర్స్కి పదేళ్ళ జైలు
- June 30, 2018బహ్రెయిన్ కస్టమ్స్ అధికారులు 17 ఏళ్ళ ఇండియన్ యువకుడ్ని మరిజువానా స్మగ్లింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 16 ఏళ్ళ వయసున్న తన సహచరుడికి అందించేందుకు ఈ డ్రగ్స్ని నిందితుడు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. బ్యాగ్ని ఎక్స్రే చేయగా, అందులో న్యూస్ పేపర్స్తో చేసిన నాలుగు బాల్స్ కన్పించాయనీ, వాటిని మ్యాన్యువల్గా తనిఖీ చేసి, ఓపెన్ చేయగా, అందులోంచి మరిజువానా బయటపడిందని అధికారులు చెప్పారు. అర కిలోగ్రాము వరకు ఈ డ్రగ్ బరువు తూగింది. నిందితులిద్దరికీ 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే చెరొక 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని సైతం న్యాయస్థానం ఖరారు చేసింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు