దిల్లీలో దారుణం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య
- July 01, 2018
దిల్లీలో దారుణం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. ఉత్తర దిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఓ ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాల కళ్లకు గంతలు, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం..వారు ఫర్నీచర్ వ్యాపారం చేసేవారట. రోజూ ఉదయం 6 గంటలకు షాప్ తెరిచేవారు, ఈరోజు 7.30 అయినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లిచూశామని 11 మంది ఉరేసుకున్నట్లు కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా? లేదా పాత కక్షలతో ఎవరైనా చంపి ఉరి తీశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఒకేసారి 11 మంది మృతదేహాలు లభ్యమయ్యేటప్పటికి చుట్టు పక్కలవారు భయబ్రాంతులకు గురవుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..