వీసా విధానాలపై నిరసనలు
- July 01, 2018
వివాదాస్పదమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై ఆ దేశంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇండియన్ అమెరికన్లు సహా వేలాది మంది ట్రంప్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం ఆ దేశంలోని పలు నగరాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 'తల్లీబిడ్డలను వేరు చేసే ట్రంప్ వీసా విధానాలు మాకొద్దు' అంటూ నినదించారు. ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల అమెరికాకు తమవారితో వస్తున్న వలసవాదుల పిల్లలు రెండు వేల మంది వారి తల్లిదండ్రుల నుంచి వేరయ్యారని, తమవారు లేక ఆ పిల్లలు అల్లాడారని నిరసనకారులు పేర్కొన్నారు. వైట్హౌస్కు సమీపంలోని పార్కులో ఇమ్మిగ్రేషన్ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు. దేశంలో పలుచోట్ల జరిగిన ఈ నిరసన కార్యక్రమాలకు డెమోక్రాటి క్ పార్టీ నాయకులు, పౌరహక్కుల నేతలు ఆధ్వర్యం వహించారు. ఇలావుండగా తమ దేశంలోకి అక్రమం గా వస్తున్న వారిని నివారించడానికి 'జీరో టాలరెన్స్' విధానాన్ని ట్రంప్ పాటిస్తున్నారు. ఈ పద్ధతిలో వలసవాదులను సంవత్సరాల తరబడి కోర్టుల్లో విచారించడం వంటి విధానాలు పాటించకుండా వారిని వచ్చినట్టే వారిని ఆయా దేశాలకు తిప్పి పంపిస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..