24 గంటల్లో 22 వేల ఎకరాలు బుగ్గిపాలు

- July 02, 2018 , by Maagulf
24 గంటల్లో 22 వేల ఎకరాలు బుగ్గిపాలు

లాస్‌ఏంజెల్స్‌: ఉత్తర కేలిఫోర్నియాలోని యోలో కౌంటీలో శనివారం మధ్యాహ్నం రగులుకున్న కార్చిచ్చు ఆదివారం ఉదయం నాటికి దాదాపు 22 వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని బుగ్గిపాలు చేసింది. దీనితో అక్కడ నివశిస్తున్న వేలాది మంది ప్రజలను బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. శనివారం మధ్య్నాం యోలో కౌంటీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆరంభమైన ఈ కార్చిచ్చు వేగంగా విస్తరించటంతో ఆ ప్రాంతంలో వేడిగాలులు, విపరీతమైన వేడీ వ్యాపించాయని కాలిఫోర్నియా ఫైర్‌సర్వీస్‌ (కాల్‌ఫైర్‌) అధికారులు చెప్పారు. గిండా ప్రాంతంలోని రగులుకున్న ఈ కార్చిచ్చు కారణంగా అక్కడి మొత్తం నివాసితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఈ అగ్నికీలలను అదుపు చేసేందుకు 29 మంది అగ్నిమాపక సిబ్బంది, 110 అగ్నిమాపక శకటాలు, 12 హెలీకాప్టర్లు సమిష్టిగా ప్రయత్నిస్తున్నాయని కాల్‌ఫైర్‌ సర్వీస్‌ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com