గుహలో చిక్కుకున్న థాయ్‌లాండ్ వాసులు క్షేమం

- July 02, 2018 , by Maagulf
గుహలో చిక్కుకున్న థాయ్‌లాండ్ వాసులు క్షేమం

ఉత్తర థాయిలాండ్‌లో తొమ్మిది రోజుల క్రితం గుహల్లో చిక్కుకుపోయిన 12 మంది బాలురు, వారి 25 ఏళ్ల పుట్‌బాల్‌ కోచ్‌ కథ సుఖాంతమైంది. వారంతా ప్రాణాలతోనే ఉన్నారని చియాంగ్‌ రాయ్‌ ప్రావిన్స్‌ గవర్నరు వెల్లడించారు. వారందర్నీ థాయిలాండ్‌ నావికాదళానికి చెందిన గజ ఈతగాళ్లు, సహాయక సిబ్బంది సోమవారం అర్ధరాత్రి క్షేమంగా తీసుకొచ్చే పనిలో ఉన్నారన్నారు. వారందరికీ ఆహారంతో పాటు ఈదడం వచ్చిన వైద్యుడ్ని పంపిస్తున్నామని చెప్పారు. 11 నుంచి 16 ఏళ్ల వయస్సుగల 12 మంది బాలురు, వారి కోచ్‌తో పాటు గుహలు చూడటానికి జూన్‌ 23న వెళ్లారు. వరద తాకిడికి ఓ గుహలో చిక్కుకుపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com