వెంకీ, వరుణ్ తేజ్‌ల మల్టీస్టారర్ షూటింగ్ ప్రారంభం

- July 05, 2018 , by Maagulf
వెంకీ, వరుణ్ తేజ్‌ల మల్టీస్టారర్ షూటింగ్ ప్రారంభం

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కనున్న మల్టీస్టారర్ నేడు(గురువారం) ప్రారంభమైంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎఫ్ 2 అనే టైటిల్‌ను.. అలాగే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేసింది చిత్రబృందం. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల 21 వరకూ కొనసాగనుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో ప్లాన్ చేసింది చిత్రబృందం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com