68 సెకండ్లలో 50 ఘాటు మిర్చిలు తిని...

- July 09, 2018 , by Maagulf
68 సెకండ్లలో 50 ఘాటు మిర్చిలు తిని...

చైనాకు చెందిన  ఓ వ్యక్తి ఏకకాలంలో 50 ఎర్రని మిరపకాయలను తిని రికార్డు సృష్టించాడు.  కేవలం 68 సెకండ్లలో వీటిని తిని అందర్ని అశ్చర్యపరిచాడు.  చైనాలలోని నింగ్‌గ్జియాంగ్‌లో గత రెండేండ్లగా చిల్లీ పెప్పర్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పోటిలో ఎవరైతే  తొందరగా ఎక్కువ మిరపకాయలను తింటారో  వారిని విజేతగా ప్రకటిస్తారు.  గెలిచిన  వారికి  3 గ్రాముల విలువైన 24 క్యారెట్ల గోల్డ్‌ను బహుకరిస్తారు. అయితే  టాంగ్ షువాయ్‌హయ్ అనే వ్యక్తి కేవలం 68 సెకండ్లలో ఘాటైన   టబస్కో మిర్చీలను  తిని రికార్డు  నెలకొల్పాడు. . అంటే ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చీలలో టబస్కో  ఓకటి. ఈ మిర్చి ఘాటును స్కావిల్ హీట్ స్కేల్‌తో  కొలిస్తే.. 30000 నుంచి 50000 ర్యాంకు ఘడతను కలిగి ఉంటాయట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com