విశాఖపట్నం-కౌలాలంపూర్ 3,399కే టికెట్
- July 11, 2018న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల కోసం మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా తగ్గింపు ధరల్లో 30 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు ఎయిర్ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.3,399గా, కొచ్చి-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.3,699గా ఉంటుందని పేర్కొంది. సోమవారం ప్రారంభమైన ఈ ఆఫర్ వారం రోజులు ఉంటుందని, ఈ ఆఫర్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వ చ్చే ఏడాది మే 31 వరకు ఎప్పుడైన ప్రయాణించవచ్చని తెలిపింది.
కోల్కతా-కౌలాలంపూర్, బెంగుళూరు-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.6,999గా, తిరుచ్చి-హైదరాబాద్ టికెట్ ధర రూ.4,699గా ఉంటుందని పేర్కొంది. అలాగే బెంగుళూరు-కొచ్చి, బెంగుళూరు-గోవా, బెంగుళూరు-జైపూర్, బెంగుళూరు-చండీగఢ్ వంటి దేశీ విమాన టికెట్ ధరలు వరుసగా రూ.1,390,రూ.1,690, రూ.3,290, రూ.3,490గా ఉంటాయని ఎయిర్ఏషియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిట్టు చాండిల ్య తెలిపారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు