ఢిల్లీలో ఐఎస్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

- July 11, 2018 , by Maagulf
ఢిల్లీలో ఐఎస్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

న్యూఢిల్లీలో మానవ బాంబు దాడితో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్‌ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు అఫ్ఘాన్‌ జాతీయుడైన యువకుడికి ఐఎస్ నేతలు టాస్క్‌ అప్పగించారు. అతడు ఢిల్లీలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరాడు. మానవ బాంబు దాడి కోసం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడు. బాంబును తయారు చేసుకునే సరంజామా అంతా లభించినా.. ట్రిగ్గర్‌ (ఐఈడీ సర్క్యూట్‌) దొరక్కపోవడంతో.. తన లక్ష్యాన్ని పూర్తిచేయలేకపోయాడు. దర్యాప్తు సంస్థలు నిందితుడిని పకడ్బందీ ప్రణాళికతో అరెస్టు చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com