వీకెండ్ వెదర్: యూఏఈలో వేడి మరింత తీవ్రం
- July 12, 2018
రానున్న రోజుల్లో వాతావరణం మరింత వేడిగా మారబోతోంది. ఇప్పటికే 50 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని వాతవరణ శాఖ హెచ్చరించింది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం కొన్ని చోట్ల మేఘావృతమైనప్పటికీ, మొత్తంగా వాతావరణం వేడిగా వుంటుందని తెలుస్తోంది. గాలుల తీవ్రత సాధారణం నుంచి ఓ మోస్తరుగా వుంటుంది. వీకెండ్లో బయటి ప్రదేశాల్లో విహరించాలనుకునేవారికి వాతావరణం ఇబ్బందికరంగానే మారుతుంది. 51 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరనున్న దరిమిలా డీ హైడ్రేషన్కి గురయ్యే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. డస్ట్ ఎక్కువగా వుండడం, దానికి గాలులు తోడవడంతో విజిబిలిటీ తక్కువ వుంటుంది గనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







