మరో నెల రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు
- July 18, 2018థాయ్లాండ్ థామ్ లువాంగ్ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్బాల్ కోచ్ మీడియాతో మాట్లాడారు. చిన్నారులు, వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో కలసి మాట్లాడారు. గుహలో తాము ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. తొలుత చిన్నారులు అందరికి నమస్కారం చెబుతూ, ఫుట్బాల్ చేతిలో పట్టుకొని వేదికగా వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్థలంలో కొద్ది సేపు ఫుట్బాల్ ఆడారు. వారు సరాదాగా ఫుట్బాల్ ఆడిన వీడియో వైరల్గా మారింది.
చిన్నారులతో పాటు వారి కోచ్ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. వారందరి బరువు సరాసరిగా 3 కేజీలు పెరిగినట్టు తెలిపారు. మరోవైపు వైద్యులు సూచించిన ప్రశ్నలను మాత్రమే అడిగేందుకు అనుమతించారు. వారందరి మానసిక సమతుల్యత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చికిత్స ముగియడంతో అందరినీ ఇళ్లకు పంపించారు. బాలలను, వారి తల్లిదండ్రులను మరో నెల రోజుల వరకు మీడియాలో మాట్లాడకూడదని చెప్పి పంపారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం