తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం..
- July 21, 2018
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం..వాయు గుండంగా మారింది. ఈ వాయుగుండం ఒరిస్సా బాలాసోర్ సమీపంలో కేంద్రకృతమైంది. దీని ప్రభావంతో ఒరిస్సాతో పాటు ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఏపీలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురువొచ్చు. రాయలసీమలో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉంది. ఇక తెలంగాణ అంతటా ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.
వాయుగుండం ఎఫెక్ట్ తో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు ఒడిస్సా నుంచి పోటెత్తిన వరద నీటితో నాగావళి, వంశదార నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు...వంశదార బ్యారేజ్ దగ్గర 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు వరదల ధాటికి మందస మండలం వీర గున్నమ్మపురం దగ్గర మహేంద్ర తనయా నదిపై నిర్మిస్తున్న తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది.
శ్రీకాకుళం జిల్లా తీరంలో గల్లంతైన మత్స్యాకారులు మరో నలుగురు కూడా సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలం కావటంతో చేపల వేటకు వెళ్లిన బోటు బోల్తాపడింది. బోటులో ఎనిమిది మంది జాలర్లు ఉండగా..ముగ్గురు ఈదుకుంటు అర్ధరాత్రే ఒడ్డుకు చేరుకున్నారు. మరో నలుగుర్ని ఈ రోజు స్థానికులు రక్షించారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







