అధికారులపై హత్యాయత్నం: ఆరుగురిపై విచారణ

- July 23, 2018 , by Maagulf
అధికారులపై హత్యాయత్నం: ఆరుగురిపై విచారణ

పోలీసు అధికారుల్ని చంపేందుకు యత్నించారంటూ ఆరుగురు యువకులపై కేసులు నమోదవగా, ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితులంతా 16 నుంచి 26 ఏళ్ళ మధ్య వయసున్న యువకులే. నువైద్రాత్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాస్క్‌లు ధరించిన 20 నుంచి 25 మంది ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆందోళనల్ని అడ్డుకునేందుకు వెళ్ళిన తమపై దాడి చేశారనీ, ఈ క్రమంలో ఓ బాంబు పేలుడు సంభవించిందనీ, ఓ అధికారి గాయపడ్డారని, పెట్రోల్‌ కార్‌ డ్యామేజ్‌ అయ్యిందని అధికారులు వివరించారు. గాయపడ్డ పోలీసు అధికారిని, మిగతా సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 8 ఫైర్‌ బాంబులు, 22 బాటిల్స్‌ (మోలోటోవ్‌ కాక్‌టెయిల్స్‌ కోసం వినియోగించేవి) స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com