ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన డైరెక్టర్ మణిరత్నం
- July 26, 2018
ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చెన్నైలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. తెలుగు, తమిళంలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను రూపొందించిన మణిరత్నం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గీతాంజలి, రోజా, బొంబాయి, నాయకుడు సహా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయే అనేక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి సుహాసినిని ఆయన వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు 63 ఏళ్లు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మణిరత్నం త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో ‘చెక్క చీవంత వాణం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘నవాబ్’ టైటిల్తో విడుదల కాబోతోంది. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, సింబు, అదితి రావ్ హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.
తాజా వార్తలు
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!







