ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన డైరెక్టర్ మణిరత్నం

- July 26, 2018 , by Maagulf
ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన డైరెక్టర్ మణిరత్నం

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చెన్నైలోని థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. తెలుగు, తమిళంలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను రూపొందించిన మణిరత్నం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గీతాంజలి, రోజా, బొంబాయి, నాయకుడు సహా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయే అనేక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి సుహాసినిని ఆయన వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు 63 ఏళ్లు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మణిరత్నం త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో ‘చెక్క చీవంత వాణం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘నవాబ్‌’ టైటిల్‌తో విడుదల కాబోతోంది. అరవింద్‌ స్వామి, విజయ్‌ సేతుపతి, సింబు, అదితి రావ్‌ హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com