ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన డైరెక్టర్ మణిరత్నం
- July 26, 2018
ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చెన్నైలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. తెలుగు, తమిళంలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను రూపొందించిన మణిరత్నం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గీతాంజలి, రోజా, బొంబాయి, నాయకుడు సహా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయే అనేక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి సుహాసినిని ఆయన వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు 63 ఏళ్లు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మణిరత్నం త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో ‘చెక్క చీవంత వాణం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘నవాబ్’ టైటిల్తో విడుదల కాబోతోంది. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, సింబు, అదితి రావ్ హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







