అబుదాబీ రోడ్లపై ఇకపై నో మోర్ గ్రేస్ స్పీడ్ లిమిట్స్
- July 27, 2018అబుదాబీ:ఆగస్ట్ 12 నుంచి నిర్దేశిత స్పీడ్ లిమిట్ని మించి వాహనదారులు వేగంతో వెళ్ళడానికి వీల్లేదు. ఎలాంటి గ్రేస్ పీరియడ్ ఇకపై వుండదని అబుదాబీ పోలీస్ పేర్కొంది. రోడ్లపై రాడార్లను తదనుగుణంగా మార్పులు చేయడం జరిగిందని అబుదాబీ పోలీస్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అబుదాబీ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మొహ్మద్ ఖల్ఫాన్ అల్ రొమైతి మాట్లాడుతూ, రోడ్ యాక్సిడెంట్స్ ఇండెక్స్ మరియు ట్రాఫిక్ డెన్సిటీపై పలు అధ్యయనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా స్పీడ్ లిమిట్స్ని మించి గంటకు 20 కిలోమీటర్ల మేర గ్రేస్ పీరియడ్ని వాహనదారులకు అమలు చేస్తూ వచ్చారు. ఉదాహరణకి ఓ రోడ్డుపై 120 కిలోమీటర్ల వేగం మాత్రమే ప్రయాణించాల్సి వుండగా, దాన్ని మించి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా రాడార్లు పసిగట్టవు. 141 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడే రాడార్లు గుర్తిస్తాయి. ఆగస్ట్ 12 నుంచి మాత్రం 121 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించినా రాడార్లు గుర్తిస్తాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..