ఈజిప్ట్:75 మందికి మరణశిక్ష
- July 28, 2018
ఈజిప్ట్లో 75 మందికి మరణశిక్ష కైరో: ఐదేళ్ల నాటి కేసుకు సంబంధించి 75 మందికి మరణశిక్ష విధిస్తూ ఈజిప్ట్లో ఒక కోర్టు తీర్పు చెప్పింది. వీరిలో నిషిద్ధ 'ముస్లిం బ్రదర్హుడ్' ముఠా అగ్రనేతలు కూడా ఉన్నారు. ఈ తీర్పును ఈజిప్ట్ అత్యున్నత ఆధ్యాత్మిక పీఠం 'గ్రాండ్ ముఫ్తి'కి కోర్టు నివేదిస్తుంది. సాధారణంగా కోర్టు నిర్ణయానికి అక్కడ సమ్మతి లభిస్తుంటుంది. ఈ కేసులో మరో 660 మందికి సెప్టెంబర్ 8న శిక్ష ఖరారు చేయనున్నారు. 2013లో నాటి అధ్యక్షుడు మహ్మద్ మోర్సి పాలనకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. దీంతో సైన్యం ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఈ నేపథ్యంలో మోర్సి మద్దతుదారులు ధర్నాకు దిగారు. ఇది హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు వీరిని చెదరగొట్టాయి. ఇందులో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు శిక్ష పడింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







