ఈజిప్ట్:75 మందికి మరణశిక్ష
- July 28, 2018ఈజిప్ట్లో 75 మందికి మరణశిక్ష కైరో: ఐదేళ్ల నాటి కేసుకు సంబంధించి 75 మందికి మరణశిక్ష విధిస్తూ ఈజిప్ట్లో ఒక కోర్టు తీర్పు చెప్పింది. వీరిలో నిషిద్ధ 'ముస్లిం బ్రదర్హుడ్' ముఠా అగ్రనేతలు కూడా ఉన్నారు. ఈ తీర్పును ఈజిప్ట్ అత్యున్నత ఆధ్యాత్మిక పీఠం 'గ్రాండ్ ముఫ్తి'కి కోర్టు నివేదిస్తుంది. సాధారణంగా కోర్టు నిర్ణయానికి అక్కడ సమ్మతి లభిస్తుంటుంది. ఈ కేసులో మరో 660 మందికి సెప్టెంబర్ 8న శిక్ష ఖరారు చేయనున్నారు. 2013లో నాటి అధ్యక్షుడు మహ్మద్ మోర్సి పాలనకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. దీంతో సైన్యం ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఈ నేపథ్యంలో మోర్సి మద్దతుదారులు ధర్నాకు దిగారు. ఇది హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు వీరిని చెదరగొట్టాయి. ఇందులో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు శిక్ష పడింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్