అబుదాబీలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
- July 30, 2018
అబుదాబీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 44 మంది గాయపడ్డారు. ఓ బస్సు, మరో రెండు వాహనాలు అల్ షవామెక్ బ్రిడ్జిపై ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వున్నపళంగా వాహనాన్ని టర్న్ చేయడం, తగినంత గ్యాప్ పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఉదయం 7.30 ఇమిషాల సమయంలో ఆపరేషన్ రూమ్కి ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందింది. పోలీస్ పెట్రోల్స్, అంబులెన్సెస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని హుటాహుటిన అల్ రహ్బా మరియు ముఫ్రాఖ్ హాస్పిటల్స్కి తరలించారు. వాహనదారులు తమ వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, రోడ్ రూల్స్ పాటించాలనీ అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







