అబుదాబీలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

- July 30, 2018 , by Maagulf
అబుదాబీలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

అబుదాబీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 44 మంది గాయపడ్డారు. ఓ బస్సు, మరో రెండు వాహనాలు అల్‌ షవామెక్‌ బ్రిడ్జిపై ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వున్నపళంగా వాహనాన్ని టర్న్‌ చేయడం, తగినంత గ్యాప్‌ పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఉదయం 7.30 ఇమిషాల సమయంలో ఆపరేషన్‌ రూమ్‌కి ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందింది. పోలీస్‌ పెట్రోల్స్‌, అంబులెన్సెస్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని హుటాహుటిన అల్‌ రహ్బా మరియు ముఫ్రాఖ్‌ హాస్పిటల్స్‌కి తరలించారు. వాహనదారులు తమ వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, రోడ్‌ రూల్స్‌ పాటించాలనీ అధికారులు సూచిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com