వలస కార్మికులకు యూఏఈ వీసా ఆమ్నెస్టీ ప్రకటన
- August 01, 2018
దుబాయ్:యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బుధవారం ఆమ్నెస్టీని ప్రకటించింది. వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడం, వర్క్ పెర్మిట్ని మించి యూఏఈలో ఓవర్ స్టేయింగ్ చేస్తుండడం వంటి వాటి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఈ ఆమ్నెస్టీ ఎంతో ఉపయోగకరంగా వుండనుంది. అక్టోబర్ 31 వరకు ఇలాంటివారు దేశం విడిచి వెళ్ళేందుకు ఎలాంటి జరీమానాలు విధించకుండా అవకాశం కల్పిస్తున్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఆరు నెలలపాటు చెల్లుబాటయ్యే వీసాల్ని కూడా ఆమ్నెస్టీ పీరియడ్లో లభించనుంది. బ్లాక్ లిస్ట్లో వున్నవారు లేదా లీగల్ కేసులు పెండింగ్లో వున్నవారికి మాత్రం ఆమ్నెస్టీ లభించదు. అధికారిక లెక్కల ప్రకారం 2016 నాటికి యూఏఈ లేబర్ పోర్స్ 6.3 మిలియన్. మొత్తం జనాభా 9.1 మిలియన్లు. యూఏఈ వర్క్ ఫోర్స్లో మెజార్టీ వలసదారులదే. రాజస్తాన్కి చెందిన 54 ఏళ్ళ గిర్రాజ్ ప్రసాద్ అనే వ్యక్తి, ఆమ్నెస్టీకి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేసుకుని, స్వదేశానికి వెళ్ళేందుకు సిద్ధంగా వున్నారు. ఆ రకంగా ఆమ్నెస్టీ పొందిన తొలి వ్యక్తిగా ఆయన వార్తల్లోకెక్కారు.దుబాయ్ లోని అల్ అవీర్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ లో అనీష్ చౌదరి(IWRC మేనేజర్-యూ.ఏ.ఈ) హెల్ప్ డెస్క్ నిర్వహించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









