వలస కార్మికులకు యూఏఈ వీసా ఆమ్నెస్టీ ప్రకటన
- August 01, 2018
దుబాయ్:యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బుధవారం ఆమ్నెస్టీని ప్రకటించింది. వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడం, వర్క్ పెర్మిట్ని మించి యూఏఈలో ఓవర్ స్టేయింగ్ చేస్తుండడం వంటి వాటి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఈ ఆమ్నెస్టీ ఎంతో ఉపయోగకరంగా వుండనుంది. అక్టోబర్ 31 వరకు ఇలాంటివారు దేశం విడిచి వెళ్ళేందుకు ఎలాంటి జరీమానాలు విధించకుండా అవకాశం కల్పిస్తున్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఆరు నెలలపాటు చెల్లుబాటయ్యే వీసాల్ని కూడా ఆమ్నెస్టీ పీరియడ్లో లభించనుంది. బ్లాక్ లిస్ట్లో వున్నవారు లేదా లీగల్ కేసులు పెండింగ్లో వున్నవారికి మాత్రం ఆమ్నెస్టీ లభించదు. అధికారిక లెక్కల ప్రకారం 2016 నాటికి యూఏఈ లేబర్ పోర్స్ 6.3 మిలియన్. మొత్తం జనాభా 9.1 మిలియన్లు. యూఏఈ వర్క్ ఫోర్స్లో మెజార్టీ వలసదారులదే. రాజస్తాన్కి చెందిన 54 ఏళ్ళ గిర్రాజ్ ప్రసాద్ అనే వ్యక్తి, ఆమ్నెస్టీకి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేసుకుని, స్వదేశానికి వెళ్ళేందుకు సిద్ధంగా వున్నారు. ఆ రకంగా ఆమ్నెస్టీ పొందిన తొలి వ్యక్తిగా ఆయన వార్తల్లోకెక్కారు.దుబాయ్ లోని అల్ అవీర్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ లో అనీష్ చౌదరి(IWRC మేనేజర్-యూ.ఏ.ఈ) హెల్ప్ డెస్క్ నిర్వహించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







