భాగ్యనగరంలో కాల్పుల కలకలం...
- August 02, 2018
హైదరాబాద్ శివారులోని శంషాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి... భూ వావాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగగా... రివాల్వర్తో బెదిరిస్తూ గాలోకి ఓ వర్గం కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ బహదూర్గూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 307 అయుధ చట్టం సెక్షన్ 27 కింద కేసు నమోదు చేసిన శంషాబాద్ రూరల్ పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
బహదూర్గూడ గ్రామంలోని 110 ఎకరాలో వివాధం చోటు చేసుకుంది... సోమాజిగుడాకు చెందిన మహమ్మద్ అల్తాఫ్ ఆ స్థలం దగ్గర సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. గత మంగళవారం సయ్యద్ రఫీ ఇషాక్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి వచ్చి... తమ భూమిలోకి ఆక్రమంగా చొరబడడమే కాకుండా రివాల్వర్తో బెదిరిస్తూ సయ్యద్ రఫీ ఒక రౌండ్ కాల్పులు జరిపాడని శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అల్తాఫ్. కాగా, ఈ మధ్యే మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఇలాంటి ఘటనే జరిగింది. వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







