మోదీతో ముగిసిన కేసీఆర్ భేటీ
- August 04, 2018
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుతో సహా 10 అంశాలను ప్రధాని మోడి ముందు ఉంచారు తెలంగాణ సీఎం కేసీఆర్.. మధ్యాహ్నం మోడీతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన 10 అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. హైకోర్టు విభజన, తెలంగాణలో కొత్త జోన్ల ఏర్పాటు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయహోదా, విభజన హామీల అమలుపై చర్చించారని సమాచారం.
కేంద్రం ఏపీకి నిధులు విడుదల చేస్తున్నా.. తెలంగాణకు నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ కోరినట్టు తెలుస్తోంది. ఐఏఎం, ఐపీఐఆర్, కరీంనగర్లో ట్రిబుల్ ఐటీ, అలాగే కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థపై కేంద్ర ఆమోదం లాంటి అంశాలపై కేసీఆర్ వినతి పత్రాలు అందించారు.
నిన్న కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ప్రసాద్ను కూడా కేసీఆర్ కలిశారు. దాదాపు గంట సేపు రవిశంకర్ప్రసాద్తో కేసీఆర్ చర్చలు జరిపారు. జోనల్ వ్యవస్థకు సత్వరమే ఆమోదముద్ర వేయాలని కేసీఆర్ కోరారు. జోనల్ వ్యవస్థ ఆవశ్యకతను రవిశంకర్ప్రసాద్కు వివరించారు. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామని, జోనల్ వ్యవస్థ వల్ల యువతకు ఎక్కువ అవకాశాలు వస్తాయని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. హైకోర్టు విభజన, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, రిజర్వేషన్ల అంశాన్ని రవిశంకర్ప్రసాద్ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







