తొలి టెస్టులో భారత్ ఓటమి
- August 04, 2018
బర్మింగ్హామ్ టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. 194 పరుగుల టార్గెట్ను ఛేదించలేకపోయింది. బౌలింగ్కు అనుకూలిస్తోన్న పిచ్పై పట్టుదలగా ఆడి విజయంపై ఆశలు రేకెత్తించిన కెప్టెన్ విరాట్కోహ్లీ నాలుగోరోజు త్వరగానే ఔటయ్యాడు. ఆట ప్రారంభమైన తొలి ఓవర్లనే దినేశ్ కార్తీక్ ఔటవగా… కోహ్లీ, హార్థిక్ పాండ్యా పార్టనర్షిప్తో భారత్ గెలుస్తుందనిపించింది. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలింగ్ను కాన్ఫిడెంట్గా ఆడారు. ఫామ్లో ఉన్న కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ స్టోక్స్ కోహ్లీని ఔట్ చేయడంతో భారత్ ఓటమి ఖాయమైంది. ఇదే ఓవర్లో షమీని కూడా స్టోక్స్ డకౌట్గా పెవిలియన్కు పంపాడు. చివర్లో పాండ్యా ధాటిగా ఆడినా… జట్టును గెలిపించలేకపోయాడు. భారత బ్యాటింగ్లో కోహ్లీ 51 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే… పాండ్యా 31 పరుగులు చేశాడు. ఇంగ్లీష్ బౌలర్లలో స్టోక్స్ 4 వికెట్లు పడగొట్టగా… ఆండర్సన్ 2, బ్రాడ్ 2, కరాన్ , రషీద్ ఒక్కో వికెట్ తీసారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 287 పరుగులు చేయగా… భారత్ 274 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ టీమ్ 180 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్లో రెండో టెస్ట్ ఆగష్ట్ 9 నుండి లార్డ్స్ వేదికగా జరగనుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







