తొలి టెస్టులో భారత్ ఓటమి
- August 04, 2018
బర్మింగ్హామ్ టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. 194 పరుగుల టార్గెట్ను ఛేదించలేకపోయింది. బౌలింగ్కు అనుకూలిస్తోన్న పిచ్పై పట్టుదలగా ఆడి విజయంపై ఆశలు రేకెత్తించిన కెప్టెన్ విరాట్కోహ్లీ నాలుగోరోజు త్వరగానే ఔటయ్యాడు. ఆట ప్రారంభమైన తొలి ఓవర్లనే దినేశ్ కార్తీక్ ఔటవగా… కోహ్లీ, హార్థిక్ పాండ్యా పార్టనర్షిప్తో భారత్ గెలుస్తుందనిపించింది. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలింగ్ను కాన్ఫిడెంట్గా ఆడారు. ఫామ్లో ఉన్న కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ స్టోక్స్ కోహ్లీని ఔట్ చేయడంతో భారత్ ఓటమి ఖాయమైంది. ఇదే ఓవర్లో షమీని కూడా స్టోక్స్ డకౌట్గా పెవిలియన్కు పంపాడు. చివర్లో పాండ్యా ధాటిగా ఆడినా… జట్టును గెలిపించలేకపోయాడు. భారత బ్యాటింగ్లో కోహ్లీ 51 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే… పాండ్యా 31 పరుగులు చేశాడు. ఇంగ్లీష్ బౌలర్లలో స్టోక్స్ 4 వికెట్లు పడగొట్టగా… ఆండర్సన్ 2, బ్రాడ్ 2, కరాన్ , రషీద్ ఒక్కో వికెట్ తీసారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 287 పరుగులు చేయగా… భారత్ 274 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ టీమ్ 180 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్లో రెండో టెస్ట్ ఆగష్ట్ 9 నుండి లార్డ్స్ వేదికగా జరగనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







