హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
- August 04, 2018
హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు రాత్రి రామ్నాథ్ కోవింద్ రాజ్భవన్లోనే బసచేయనున్నారు. ఆదివారం రాష్ట్రపతి నిలయంలో జరిగే హరితహారంలో పాల్గొంటారు. అనంతరం ఆదివారం ఉదయం 10:30గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో మొక్కలు నాటనున్నారు. ఆ తరువాత సంగారెడ్డి జిల్లా కందిలో ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవానికి హాజరవుతారు. ఆదివారం మధ్యాహ్నం చెన్నై వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







