ఎయిర్ ఇండియా విమాన పైలెట్ల ఆందోళన...
- August 10, 2018న్యూఢిల్లి: జూలైలో జీతాలు చెల్లించని ఉద్యోగుల నుంచి ఒత్తిడిని అధిగమించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయాలు మొదలుపెట్టింది.ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా శుక్రవారం సిబ్బందికి నోటీసు జారీ చేసింది, ఇందులో ఆగస్టు 13 కంతా మొత్తం జీతాలు చెల్లిస్తాం అని పేర్కొంది.
జీతాలు చెల్లించనందుకు విచారం వ్యక్తం చేస్తూ ఎయిర్ ఇండియా తన సిబ్బంది నోటీసులో చెల్లింపులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియజేసింది. యాజమాన్యం నియంత్రణకు మించి ఉన్న పరిస్థితులు కారణంగా జూలై 2018 లో జీతాలు చెల్లించడంలో ఆలస్యం జరిగిందని ఇందుకు తాము చాల చింతిస్తున్నాం అన్నారు అయితే, వచ్చే వారం నాటికి చెల్లింపులు చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఎయిర్ ఇండియాకు 11,000 కన్నా ఎక్కువ శాశ్వత సిబ్బంది ఉన్నారు.గత మార్చి నుండి వేతనాలు నెల నెలా చెల్లించడంలో ఆలస్యం జరుగుతోంది.సాధారణంగా, ఎయిర్లైన్స్ ప్రతి నెల 30 లేదా 31వ తేదిలకంతా వేతనాలు చెల్లిస్తుంది.
ఈక్విటీలో ఇన్ఫ్యూషన్కు సప్లిమెంటరీ గ్రాంట్లుగా రూ .980 కోట్లు అందించేందుకు పార్లమెంటు ఆమోదం తెలపాలని ప్రభుత్వం కోరింది. జూలై 26 న సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్సభలో మాట్లాడుతూ, మేలో జీతాలు చెల్లించడంలో కొంత ఆలస్యం అయిందని, తదనంతరం చెల్లించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..