'విస్తార ఎయిర్లైన్స్' వారి గొప్ప ఆఫర్
- August 14, 2018
ఢిల్లీ:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విమానయాన సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లతో అదరగొడుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్ను ప్రకటించగా.. తాజాగా విస్తారా ఎయిర్లైన్స్ కూడా ‘ఫ్రీడం సేల్’ను ప్రయాణికుల ముందుకు తెచ్చింది. ఈ సేల్ కింద విమాన టిక్కెట్ కేవలం రూ.1,099కే లభ్యమవుతుంది. ఈ కొత్త సేల్ ఆఫర్ బుకింగ్స్ ఆగస్టు 14వ తేదీ 00:01 am నుంచి ప్రారంభమై, 11:59 pm వరకు కొనసాగనున్నాయి. ఎస్బీఐ కార్డుద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి అదనంగా 5 శాతం క్యాష్బ్యాక్ లభిస్తోంది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకున్న బిజినెస్ క్లాస్ కస్టమర్లు 2018 ఆగస్టు 22 నుంచి 2018 అక్టోబర్ 10 వరకు ప్రయాణించవచ్చు. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ క్లాస్ కస్టమర్లు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 10 వరకు ట్రావెల్ చేయొచ్చు.
ఎకానమీ లైట్ కేటగిరీ వారికి వన్-వే ధరలు కేవలం రూ.1,099కే అందుబాటులో ఉన్నాయి. ఎకానమీ స్టాండర్డ్ కేటగిరీ వారికి రూ.1,399కు, ప్రీమియం ఎకానమీ కేటగిరీ వారికి రూ.2,499, బిజినెస్ క్లాస్ కేటగిరీ వారికి రూ.6,099కు విమాన టిక్కెట్లను విస్తారా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద సీట్లు పరిమితం. ఫస్ట్-కమ్-ఫస్ట్ సర్వ్ బేసిస్లోనే ఈ సీట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలోనే అన్ని ఛార్జీలు కలిసి ఉంటాయి. అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వన్-వే విమాన టిక్కెట్ ధర ఎకానమీ లైట్ కేటగిరీ కింద రూ.1,799 కాగ, ఎకానమీ స్టాండర్డ్ కింద 2,324 రూపాయలు, ప్రీమియం ఎకానమీ కింద 4,199 రూపాయలు, బిజినెస్ క్లాస్ కింద 15,999 రూపాయలుగా ఉంది. మిగతా రూట్ల ధరలను www.airvistara.com లో చూడవచ్చు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







