బహ్రెయిన్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- August 16, 2018 , by Maagulf

బహ్రెయిన్‌:ఇండియన్‌ ఎంబసీ సహా, బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఇండియన్‌ ఎంబసీ, పలు భారత వలసదారుల ఆర్గనైజేషన్స్‌ దేశభక్తితో ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఎంబసీ పరిసరాల్లో ఇండియన్‌ ఎంబసీ నిర్వహించిన వేడుకలకు పెద్దయెత్తున భారతీయులు హాజరయ్యారు. బహ్రెయిన్‌లో భారత రాయబారి అలోక్‌ వి సిన్హా, మువ్వన్నెల జెండాని ఎగురవేశారు. సెకెండ్‌ సెక్రెటరీ ఆనంద్‌ ప్రకాష్‌, ఇతర ఎంబసీ అధికారులు, ఇండియన్‌ కమ్యూనిటీ లీడర్స్‌ ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఎంబసీ, డిప్లమాట్‌ రాడిస్సన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కి ఇండియన్‌ కమ్యూనిటీ మెంబర్స్‌ హాజరయ్యారు. అసిస్టెంట్‌ ఫారిన్‌ మినిస్టర్‌ అబ్దుల్లా బిన్‌ ఫైసల్‌ అల్‌ దోసెరి, ఫారిన్‌ మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ షేకా రానా బింట్‌ ఇసా అల్‌ ఖలీఫా తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com