కేరళ వరదలపై మోదీ సమీక్ష

- August 17, 2018 , by Maagulf
కేరళ వరదలపై మోదీ సమీక్ష

కొచ్చి:కేరళ రాష్ట్రంలో వెల్లువెత్తిన వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ పి. సదాశివం, సీఎం పినరయి విజయన్, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖరన్ లతో సమీక్షించారు. కొచ్చిలో భారీవర్షం కురుస్తుండటంతో వరదపీడిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి మోదీ ఏరియల్ సర్వే చేయలేక పోయారు. దీంతో నావల్ బేస్ లోనే ప్రధాని వరద పరిస్థితిని సమీక్షించారు. కల్లిసరి ప్రాంతంలో వరదనీటిలో చిక్కుకుపోయిన 60 మందిని సహాయ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. 50 మంది సభ్యులున్న నేవీ బృందం చెంగనూర్ చేరుకొని వరదసహాయపనులు చేపట్టింది. కేరళలో 1568 సహాయ శిబిరాల్లో రెండులక్షలమందికి ఆశ్రయం కల్పించామని సీఎం విజయన్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com