కేరళకు తక్షణ వరద సాయం రూ.500కోట్లు..మోదీ ప్రకటన

- August 17, 2018 , by Maagulf
కేరళకు తక్షణ వరద సాయం రూ.500కోట్లు..మోదీ ప్రకటన

కొచ్చి:వరదలతో విలవిల్లాడిన కేరళ రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.500 కోట్లు ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో వెల్లువెత్తిన వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ పి. సదాశివం, సీఎం పినరయి విజయన్, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖరన్ లతో సమీక్షించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అనంతరం కేరళ గవర్నర్, సీఎం, కేంద్రమంత్రితో కలిసి ప్రధాని ఏరియల్ సర్వే కోసం ఐఎన్ఎస్ గరుడ ప్రత్యేక హెలికాప్టరులో బయలుదేరారు. నావల్ బేస్ లోనే ప్రధాని వరద పరిస్థితిని సమీక్షించారు. ఇడిన్ జిల్లలం నుంచి కావుభాగం వరకు రోడ్డు వరదనీటిలో మునగడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కేరళలో 1568 సహాయ శిబిరాల్లో రెండులక్షలమందికి ఆశ్రయం కల్పించామని సీఎం విజయన్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com