యూఏఈ ఆమ్నెస్టీ సదుపాయం వినియోగించుకోండి:కె.టి.ఆర్
- August 19, 2018
హైదరాబాద్:యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ప్రకటించిన ఆమ్నెస్టీ అవకాశాన్ని ప్రవాసులు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కె.తారకరామారావు కోరారు. యూఏఈ ప్రకటించిన ఆమ్నెస్టీ గడువు ఆగస్టు-1 నుంచి అక్టోబరు-31 వరకు మూడు నెలల పాటు ఉందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ కారణాలతో యూఏఈలో అక్రమంగా ఉంటున్న వారు అక్కడి నిబంధనలకు అనుగుణంగా రెగ్యులరైజ్ చేసుకోవచ్చని, పత్రాలు లేకుండా ఉంటున్నవారు తెలంగాణకు తిరిగి రావచ్చన్నారు. అలా తిరిగొచ్చిన వాళ్లు రెండేళ్ల నిషేధకాలం ముగిసిన తరువాత తిరిగి యూఏఈకి వెళ్లొచ్చని తెలిపారు.
పాస్పోర్ట్ లేని ప్రవాసులు సైతం ఈ ఆమ్నెస్టీ సమయంలో భారత్కు తిరిగి రావొచ్చని చెప్పారు. స్వదేశానికి రావాలనుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా హెల్ప్లైన్ ప్రారంభించామన్నారు. వివరాలకు యూఏఈ కాన్సులేట్లోని హెల్ప్డెస్క్ +00971565463903, [email protected] హైదరాబాద్లోని హెల్ప్లైన్ సెంటర్ ఫోన్ 94408 54433, ఈ-మెయిల్ [email protected] పై సంప్రదించాలని మంత్రి కోరారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









