యెమెన్:చిన్నారులను బలితీసుకున్నది అమెరికా బాంబే
- August 19, 2018
వాషింగ్టన్: యెమెన్లో శనివారం నాడు ఒక స్కూల్బస్పై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఉపయోగించిన బాంబు అమెరికా తయారు చేసినదేనని నిపుణులు స్పష్టం చేశారు. సౌదీతో కుదుర్చుకున్న ఆయుధాల ఒప్పందంలో భాగంగా ఈ బాంబును అమెరికా విక్రయించిందన్నారు. అమెరికా రక్షణ కాంట్రాక్ట్ సంస్థల్లో ఒకటైన లాక్హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఈ 227 కేజిల లాజెర్ గైడెడ్ ఎంకె-82 తరహా బాంబును ఈ నెల 9న సంకీర్ణ దళాలు ప్రయోగించటంతో పలువురు చిన్నారులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. 2016 అక్టోబర్లో ఒక కార్యక్రమంపై జరిగిన దాడిలో వినియోగించిన బాంబు వంటిదేనని నిపుణులు తేల్చిచెప్పారు. ఈ దాడిలో 155 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయాల పాలైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి..
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!







