యెమెన్‌:చిన్నారులను బలితీసుకున్నది అమెరికా బాంబే

- August 19, 2018 , by Maagulf
యెమెన్‌:చిన్నారులను బలితీసుకున్నది అమెరికా బాంబే

వాషింగ్టన్‌: యెమెన్‌లో శనివారం నాడు ఒక స్కూల్‌బస్‌పై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఉపయోగించిన బాంబు అమెరికా తయారు చేసినదేనని నిపుణులు స్పష్టం చేశారు. సౌదీతో కుదుర్చుకున్న ఆయుధాల ఒప్పందంలో భాగంగా ఈ బాంబును అమెరికా విక్రయించిందన్నారు. అమెరికా రక్షణ కాంట్రాక్ట్‌ సంస్థల్లో ఒకటైన లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ తయారు చేసిన ఈ 227 కేజిల లాజెర్‌ గైడెడ్‌ ఎంకె-82 తరహా బాంబును ఈ నెల 9న సంకీర్ణ దళాలు ప్రయోగించటంతో పలువురు చిన్నారులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. 2016 అక్టోబర్‌లో ఒక కార్యక్రమంపై జరిగిన దాడిలో వినియోగించిన బాంబు వంటిదేనని నిపుణులు తేల్చిచెప్పారు. ఈ దాడిలో 155 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయాల పాలైన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com