కేరళ వరద బాధితుల కోసం ‘ఆర్ఎక్స్100’ బైక్..
- August 20, 2018
వరదల్లో చిక్కుకున్న వారికి సాయమందించడానికి మేమున్నామంటూ దాతలెంతో మంది ముందుకొస్తున్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసింది రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం కదులుతుంది. మేమున్నామంటూ భరోసా ఇస్తుంది.
కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షల్లో విరాళాలనందిస్తున్నారు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, డైరక్టర్లు కూడా. తాజాగా ఆర్ఎక్స్100 టీం.. సినిమాలో తాము ఉపయోగించిన బైక్ని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం ఉపయోగించాలనుకుంటున్నారు. ఇందుకోసం బైక్ బిడ్ వాల్యూ రూ.50,000లుగా నిర్ణయించారు.
మీరు ఎంత మొత్తం చెల్లించి బైక్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలను [email protected] కి గానీ లేదా 9100445588 నెంబర్కి గానీ వాట్సాప్ చేయమంటోంది ఆర్ఎక్స్ యూనిట్.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







