కేరళ వరద బాధితుల కోసం ‘ఆర్ఎక్స్100’ బైక్..
- August 20, 2018
వరదల్లో చిక్కుకున్న వారికి సాయమందించడానికి మేమున్నామంటూ దాతలెంతో మంది ముందుకొస్తున్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసింది రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం కదులుతుంది. మేమున్నామంటూ భరోసా ఇస్తుంది.
కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షల్లో విరాళాలనందిస్తున్నారు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, డైరక్టర్లు కూడా. తాజాగా ఆర్ఎక్స్100 టీం.. సినిమాలో తాము ఉపయోగించిన బైక్ని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం ఉపయోగించాలనుకుంటున్నారు. ఇందుకోసం బైక్ బిడ్ వాల్యూ రూ.50,000లుగా నిర్ణయించారు.
మీరు ఎంత మొత్తం చెల్లించి బైక్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలను [email protected] కి గానీ లేదా 9100445588 నెంబర్కి గానీ వాట్సాప్ చేయమంటోంది ఆర్ఎక్స్ యూనిట్.
తాజా వార్తలు
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..







