కేరళకు రూ.700 కోట్లు విరాళం ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం

- August 21, 2018 , by Maagulf
కేరళకు రూ.700 కోట్లు విరాళం ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం

యూ.ఏ.ఈ:భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం చేయూతనందించింది. కేరళ బాధితుల సహాయార్థం యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్లును విరాళం ప్రకటించిందని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు.ఇప్పటికే కేరళను ఆదుకునేందుకు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ప్రకటించగా, పలు రాష్ట్రాలు తమవంతు సాయాన్ని ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.10కోట్ల సాయాన్ని అందించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com