కేరళీయులను కాపాడిన వారికి 3వేలు ఇస్తామంటే, తిరస్కరించిన మత్స్యకారులు
- August 21, 2018
తిరువనంతపురం: కేరళ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఆరెస్సెస్తో పాటు మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. సహాయం చేస్తున్న వారికి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ రివార్డు ఇస్తామని చెప్పగా, వారు సున్నితంగా తిరస్కరించారు.
వరదలలో చిక్కుపోయిన వారిని మత్స్యకారులు కూడా ప్రాణాలతు తెగించి కాపాడుతున్నారు. అలా సాయం చేస్తున్న వారికి ఒక్కొక్కరికి రూ.3000 ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అయితే దానిని మత్స్యకారులు తిరస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఫోర్ట్ కొచ్చికి చెందిన మత్స్యకారుల నాయకుడు ఖాయాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తమను ప్రశంసించడం ఆనందంగా ఉందని చెప్పారు. నేను, నా మిత్రులు ఎంతోమందినికాపాడామని చెప్పారు. తమను సహాయం అందించిన వారి పాలిట ఆర్మీలా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు.
తమ సహాయానికి గాను ఒక్కొక్కరికి రూ.3వేలు ఇస్తామని చెప్పినట్లుగా విన్నామని, అది తమను బాధించిందని, ఎందుకంటే మేం డబ్బుల కోసం ఆ పని చేయలేదన్నారు. తోటి వారి ప్రాణాలు కాపాడినందుకు తమకు డబ్బులు అవసరం లేదని చెప్పారు. నష్టపోయిన తమ పడవలను ప్రభుత్వం బాగు చేయిస్తానని చెప్పిందని, అందుకు అందరం సంతోషంగా ఉన్నామని చెప్పారు. తాము మానవత్వంతో సాయం చేశామన్నారు. మా సాయానికి వెలకట్టవద్దన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







