కేరళీయులను కాపాడిన వారికి 3వేలు ఇస్తామంటే, తిరస్కరించిన మత్స్యకారులు
- August 21, 2018
తిరువనంతపురం: కేరళ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఆరెస్సెస్తో పాటు మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. సహాయం చేస్తున్న వారికి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ రివార్డు ఇస్తామని చెప్పగా, వారు సున్నితంగా తిరస్కరించారు.
వరదలలో చిక్కుపోయిన వారిని మత్స్యకారులు కూడా ప్రాణాలతు తెగించి కాపాడుతున్నారు. అలా సాయం చేస్తున్న వారికి ఒక్కొక్కరికి రూ.3000 ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అయితే దానిని మత్స్యకారులు తిరస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఫోర్ట్ కొచ్చికి చెందిన మత్స్యకారుల నాయకుడు ఖాయాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తమను ప్రశంసించడం ఆనందంగా ఉందని చెప్పారు. నేను, నా మిత్రులు ఎంతోమందినికాపాడామని చెప్పారు. తమను సహాయం అందించిన వారి పాలిట ఆర్మీలా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు.
తమ సహాయానికి గాను ఒక్కొక్కరికి రూ.3వేలు ఇస్తామని చెప్పినట్లుగా విన్నామని, అది తమను బాధించిందని, ఎందుకంటే మేం డబ్బుల కోసం ఆ పని చేయలేదన్నారు. తోటి వారి ప్రాణాలు కాపాడినందుకు తమకు డబ్బులు అవసరం లేదని చెప్పారు. నష్టపోయిన తమ పడవలను ప్రభుత్వం బాగు చేయిస్తానని చెప్పిందని, అందుకు అందరం సంతోషంగా ఉన్నామని చెప్పారు. తాము మానవత్వంతో సాయం చేశామన్నారు. మా సాయానికి వెలకట్టవద్దన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి