తెలంగాణ:దర్గా వందల ఏళ్ల నుండి సర్వ మతాలకు వేదిక
- August 21, 2018తెలంగాణ:వందల ఏళ్ల నుండి కులమతాలకు అతీతంగా నిలిచింది ఆ దర్గా. సర్వ మతాలకు వేదిక ఆ దర్గా.అదే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ సయ్యద్ అంకుషావలి రహ్మతుల్లా దర్గా.బక్రీద్ పర్వదినం ప్రారంభం కానున్న సంధర్బంగా ఈ దర్గా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచే ఈ దర్గా ప్రాంతంలో ఏ కులానికి చెందిన వారైనా అంతా సమానమే.ఆధ్యాత్మికతే ప్రధానం.విశ్వాసాలు వేరైనా ఆ ప్రార్ధనా మందిరంలో నిర్వహించే పూజలపై భక్తులకు ఎనలేని నమ్మకం.ఇక్కడ ప్రతి యేటా బక్రిద్ పండుగ రోజున ఉర్సు ఉత్సవాలు ప్రాంభమవుతాయి.
సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన బిజిగిరి షరీఫ్ దర్గాని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు పూర్వీకులు చెబుతారు.ఇది జమ్మికుంట పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది.విశ్వమానవ సమానత్వం చాటిన సోదరులు సయ్యద్ అంకుషావళి రహమతుల్లా అలై తదితరుల సమాధులు యిక్కడ వున్నాయి.అరబ్ దేశం నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ బిజిగిరి షరీఫ్ గ్రామానికి చేరుకుని దర్గాను నిర్మించుకున్నారు హజ్రత్ సయ్యద్ అంకుషావలి. ఆయన ప్రదర్శించిన మహిమల కారణంగా ప్రజలు సుఖశాంతుల జీవించారని చెబుతారు.నిష్టతో వేడుకుంటే భక్తుల కోర్కెలు అంకుషావలి తప్పక తీరుస్తారనేది ఇక్కడ భక్తుల నమ్మకం.
ఈ దర్గాలో బక్రిద్ పండుగ రోజున సాయంత్రం ఉర్సు ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.భక్తుల మొక్కులు చెల్లించటంతో ఉత్సవాలు ముగుస్తాయి.ప్రధాన ఘట్టమైన గంధలేపనం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతుంది.ఈ ఉర్సు ఉత్సవంలో మన రాష్ట్రం తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు పాల్గొంటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా