కేరళకు యూఏఈ సాయంపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడి స్పందన
- August 21, 2018
హైదరాబాద్: రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ సవతి తల్లిప్రేమను విడనాడాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ.అసదుద్దీన్ఒవైసీ డిమాండ్ చేశారు. కేరళ వరద బాధితుల సహాయారం యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్లను ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. 2017లో భారతదేశానికి 69 బిలియన్ డాలర్ల విదేశీమారకద్రవ్యం సమకూరగా అందులో సుమారు 40శాతం వరకు కేరళ ప్రవాసుల నుంచి వచ్చినట్టు ఆయన గుర్తు చేశారు.
కేరళ వరద తాకిడిలో సుమారు రూ. 20వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమిక అంచనా వేయగా కేంద్రం కేవలం రూ. 500 కోట్లు మాత్రమే సాయంగా ప్రకటించడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయనేతల విగ్రహాల స్థాపన కోసం రూ. 2వేల నుంచి రూ.3వేల కోట్ల వరకు వ్యయం చేస్తున్న ప్రభుత్వాలు ఆపదల్లో చిక్కి కొట్టుమిట్లాడుతున్న కేరళ ప్రజలను ఆదుకునేందుకు నామమాత్రంగా సాయం ప్రకటించడం విచిత్రంగా ఉందన్నారు. ఇప్పటికైనా కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఉదారంగా మరింత సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







