అమరావతి బాండ్లు, పీడీ ఖాతాల్లో అక్రమాలు జరిగాయని గవర్నర్‌కు ఫిర్యాదు

- August 22, 2018 , by Maagulf
అమరావతి బాండ్లు, పీడీ ఖాతాల్లో అక్రమాలు జరిగాయని గవర్నర్‌కు ఫిర్యాదు

అమరావతి:టీడీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ నేతలు దాడి ముమ్మరం చేశారు. విజయవాడ గేట్‌ వే హోటల్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన బీజేపీ నేతలు..రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. వీటిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. గవర్నర్‌తో సమావేశమైనవారిలో ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రధానంగా భోగాపురం ఎయిర్‌ పోర్ట్ టెండర్లు, ఏపీ అర్బన్ హౌసింగ్‌ టెండర్లు..అమరావతి బాండ్లు, పీడీ ఖాతాల్లో అక్రమాలు జరిగినట్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com