మంత్రి కెటిఆర్‌ను కలిసిన వాట్సప్‌, నోవాటీస్‌ సిఈఓలు

- August 24, 2018 , by Maagulf
మంత్రి కెటిఆర్‌ను కలిసిన వాట్సప్‌, నోవాటీస్‌ సిఈఓలు

హైదరాబాద్‌: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావుతో వాట్సప్‌, నోవాటీస్‌ సిఈఓలు భేటి అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జినోమ్‌ వ్యాలీలో పెట్టుబడులు పెట్టాలని నోవాటీస్‌ సిఈఓ వాస్‌ నరసింహన్‌ను కోరారు. పర్యావరణ పరరిక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాటు తీసుకుంటూ జినోమ్‌ వ్యాలీలో పరిశ్రమలనుఏర్పాటు చేస్తున్నామన్నారు. లైఫ్‌ సైన్స్‌ రంగంలో జాతీయ సగటు 1.18 ఉండగా తెలంగాణ 2.41 ఉందని, గడిచిన నాలుగు సంవత్సరాలలో రూ.10,200కోట్లు పెట్డుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా వాట్సప్‌ సిఈఓ భేటి అయిన మంత్రి కెటిఆర్‌ నగరంలో వాట్సప్‌ సిఈఓ చారిస్‌ డెనియల్‌ను కోరారు. అయితే దీనిపై డేనియన్‌ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో వాట్సప్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌ శివంత్‌ తుక్‌రాల్‌తో పాటు ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, డిజిటల్‌ మీడియా దిలీప్‌ కొణతం ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com