జమారత్పై 166 మిలియన్ రాళ్ళు
- August 24, 2018
మినా:గురువారం సాయంత్రం నాటికి 166,07,250 రాళ్ళను జమరాత్పైకి విసిరారు హజ్ ఫిలిగ్రిమ్స. 'స్టోనింగ్ ఆఫ్ ది డెవిల్' కార్యక్రమంలో భాగంగా తొలి రెండ్రోజుల్లో 1.6 మిలియన్ ఫిలిగ్రిమ్స్ రాళ్ళను విసిరారు. గ్రాండ్ మాస్క్లో తవాఫ్ ప్రేయర్స్ నిర్వహించిన ఫిలిగ్రిమ్స్, 'సైతాన్'పై రాళ్ళు విసరడం ఆనవాయితీ. ఈ ఏడాది 2,371,675 మంది ఫిలిగ్రిమ్స్ హజ్ యాత్రను నిర్వహించారు. వీరిలో 1,758,722 మంది విదేశాలకు చెందినవారు కాగా, కింగ్డమ్కి చెందిన 612,953 మంది ఉన్నారని కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కల్నల్ తారిక్ అల్ ఘబ్బామ్ చెప్పారు. మొదటి రెండ్రోజులు సైతాన్పై రాళ్ళు విసిరిన ఫిలిగ్రిమ్స్ మూడో రోజు కూడా అదే పని చేయాల్సిన అవసరం లేదనీ, వీలైనంత త్వరగా మినాని విడిచి వెళ్ళాల్సి వుంటుందని ఆయన వివరించారు. తష్రీక్ మూడో రోజున మిగిలిన ఫిలిగ్రిమ్స్, జమరాత్పై రాళ్ళను విసురుతారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







