జమారత్పై 166 మిలియన్ రాళ్ళు
- August 24, 2018మినా:గురువారం సాయంత్రం నాటికి 166,07,250 రాళ్ళను జమరాత్పైకి విసిరారు హజ్ ఫిలిగ్రిమ్స. 'స్టోనింగ్ ఆఫ్ ది డెవిల్' కార్యక్రమంలో భాగంగా తొలి రెండ్రోజుల్లో 1.6 మిలియన్ ఫిలిగ్రిమ్స్ రాళ్ళను విసిరారు. గ్రాండ్ మాస్క్లో తవాఫ్ ప్రేయర్స్ నిర్వహించిన ఫిలిగ్రిమ్స్, 'సైతాన్'పై రాళ్ళు విసరడం ఆనవాయితీ. ఈ ఏడాది 2,371,675 మంది ఫిలిగ్రిమ్స్ హజ్ యాత్రను నిర్వహించారు. వీరిలో 1,758,722 మంది విదేశాలకు చెందినవారు కాగా, కింగ్డమ్కి చెందిన 612,953 మంది ఉన్నారని కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కల్నల్ తారిక్ అల్ ఘబ్బామ్ చెప్పారు. మొదటి రెండ్రోజులు సైతాన్పై రాళ్ళు విసిరిన ఫిలిగ్రిమ్స్ మూడో రోజు కూడా అదే పని చేయాల్సిన అవసరం లేదనీ, వీలైనంత త్వరగా మినాని విడిచి వెళ్ళాల్సి వుంటుందని ఆయన వివరించారు. తష్రీక్ మూడో రోజున మిగిలిన ఫిలిగ్రిమ్స్, జమరాత్పై రాళ్ళను విసురుతారు.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..