జమారత్పై 166 మిలియన్ రాళ్ళు
- August 24, 2018
మినా:గురువారం సాయంత్రం నాటికి 166,07,250 రాళ్ళను జమరాత్పైకి విసిరారు హజ్ ఫిలిగ్రిమ్స. 'స్టోనింగ్ ఆఫ్ ది డెవిల్' కార్యక్రమంలో భాగంగా తొలి రెండ్రోజుల్లో 1.6 మిలియన్ ఫిలిగ్రిమ్స్ రాళ్ళను విసిరారు. గ్రాండ్ మాస్క్లో తవాఫ్ ప్రేయర్స్ నిర్వహించిన ఫిలిగ్రిమ్స్, 'సైతాన్'పై రాళ్ళు విసరడం ఆనవాయితీ. ఈ ఏడాది 2,371,675 మంది ఫిలిగ్రిమ్స్ హజ్ యాత్రను నిర్వహించారు. వీరిలో 1,758,722 మంది విదేశాలకు చెందినవారు కాగా, కింగ్డమ్కి చెందిన 612,953 మంది ఉన్నారని కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కల్నల్ తారిక్ అల్ ఘబ్బామ్ చెప్పారు. మొదటి రెండ్రోజులు సైతాన్పై రాళ్ళు విసిరిన ఫిలిగ్రిమ్స్ మూడో రోజు కూడా అదే పని చేయాల్సిన అవసరం లేదనీ, వీలైనంత త్వరగా మినాని విడిచి వెళ్ళాల్సి వుంటుందని ఆయన వివరించారు. తష్రీక్ మూడో రోజున మిగిలిన ఫిలిగ్రిమ్స్, జమరాత్పై రాళ్ళను విసురుతారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







