యెమెన్ఫై సౌదీ కూటమి వైమానిక దాడులు
- August 24, 2018సానా: సౌదీ సైనిక జరిపిన వైమానిక దాడుల్లో పలువురు పౌరులు మరణించారని యెమెన్లోని హుతీ రెబెల్స్ తెలిపారు. మృతుల్లో ఎక్కువమంది పిల్లలే వున్నారు. కాగా ఈ దాడుల వార్తలను సంకీర్ణ కూటమి తిరస్కరించింది. గురువారం జరిగిన ఈ దాడుల్లో 22మంది పిల్లలు, నలుగురు మహిళలతో సహా పలువురు చనిపోయారని హుతీ రెబెల్స్కి చెందిన టివి తెలిపింది. రెడ్ సీ నగరమైన హుదైదా నుండి 20కిలోమీటర్ల దూరంలో గల అడ్ దురైహిమిలో శరణార్ధుల శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. స్కూలు బస్సుపై సంకీర్ణ కూటమి జరిపిన దాడుల్లో 40మంది బాలురు మరణించిన రెండు వారాల్లోనే ఈ దాడి చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..