యెమెన్‌ఫై సౌదీ కూటమి వైమానిక దాడులు

- August 24, 2018 , by Maagulf
యెమెన్‌ఫై సౌదీ కూటమి వైమానిక దాడులు

సానా: సౌదీ సైనిక జరిపిన వైమానిక దాడుల్లో పలువురు పౌరులు మరణించారని యెమెన్‌లోని హుతీ రెబెల్స్‌ తెలిపారు. మృతుల్లో ఎక్కువమంది పిల్లలే వున్నారు. కాగా ఈ దాడుల వార్తలను సంకీర్ణ కూటమి తిరస్కరించింది. గురువారం జరిగిన ఈ దాడుల్లో 22మంది పిల్లలు, నలుగురు మహిళలతో సహా పలువురు చనిపోయారని హుతీ రెబెల్స్‌కి చెందిన టివి తెలిపింది. రెడ్‌ సీ నగరమైన హుదైదా నుండి 20కిలోమీటర్ల దూరంలో గల అడ్‌ దురైహిమిలో శరణార్ధుల శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. స్కూలు బస్సుపై సంకీర్ణ కూటమి జరిపిన దాడుల్లో 40మంది బాలురు మరణించిన రెండు వారాల్లోనే ఈ దాడి చోటు చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com