విభేదాలను పరిష్కరించుకుందాం:రష్యా,టర్కీల నిర్ణయం
- August 25, 2018
మాస్కో:రష్యా యుద్ధ విమానాన్ని 2015లో టర్కీ కూల్చివేసినప్పటి నుండి నెలకొని వున్న విభేదాలను పరిష్కరించుకోవాలని రష్యా, టర్కీ నిర్ణయించాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ తెలిపారు. టర్కీని తమ కీలకమైన వాణిజ్య, ఆర్థిక భాగస్వాముల్లో ఒకరిగా రష్యా పరిగణిస్తుందని లావ్రోవ్ పేర్కొన్నారు. టర్కీ విదేశాంగ మంత్రి మెవల్ట్తో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, వాణిజ్య టర్నోవర్ స్థిరంగా పెరుగుతూ వస్తోందని, గత ఏడాది కన్నా 40శాతం పైగా పెరిగి 2200కోట్ల డాలర్లకు చేరిందని చెప్పారు. టర్కీ స్ట్రీమ్ గ్యాస్ పైప్లైన్తో పాటు ఇరు దేశాలు ఉమ్మడిగా ఇంధన ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ఇరు దేశాలకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవని, మొత్తంగా యూరప్లో ఇంధన భద్రతకు కీలకమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







